హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే (సీఏఎస్)పై శుక్రవారం నుంచి 12 వరకు వర్క్షాప్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 39 మంది టీచర్లు ఈ వర్క్షాప్కు హాజరవుతారు. ఎంపికైన ఉపాధ్యాయులు వర్క్షాప్కు హాజరయ్యేలా చూడాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశించింది.