హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం జరిగిన పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు విద్యార్థులను ఇబ్బందిపెట్టాయి. ముఖ్యంగా గణితం ప్రశ్నలు జేఈఈ స్థాయిలో ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో సమయం సరిపోలేదని పేర్కొన్నారు. ఫిజిక్స్ సైతం కాస్త కఠినంగానే ఉన్నట్టు కొందరు విద్యార్థులు చెప్పారు. కెమిస్ట్రీ మధ్యంగా ఉన్నట్టు, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్ పాఠ్యాంశాల నుంచి అధిక ప్రశ్నలిచ్చినట్టు వెల్లడించారు. గణితం ప్రశ్నలు కాస్త కఠినంగా ఇవ్వగా, కెమిస్ట్రీ సులభంగా ఉన్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కో ఆర్డినేటర్ ఉమాశంకర్ విశ్లేషించారు.
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు ఆదివారం 93 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. ఉదయం సెషన్లో 35,092 మంది విద్యార్థులకు 32,673 (93.11శాతం), మధ్యా హ్నం సెషన్లో 35,518 మందికి 33,225 (93.54 శాతం) విద్యార్థులు హాజరైనట్టు వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.