హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్త్రీలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు అన్ని విధాలా అండగా ఉంటున్న డీజీపీ మహేందర్రెడ్డికి సేవ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారం డీజీపీ మహేందరెడ్డిని సేవ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం అధికారులు కలిశారు. సేవ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం చైతన్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మహేందర్రెడ్డికి చిత్రపటాన్ని బహూకరించారు. డీజీపీని కలిసిన వారిలో తుపాకుల రామాంజనేయరెడ్డి, సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ గౌరవ సలహాదారు సాదు పద్మభూషణ్, సభ్యులు జయలింగారెడ్డి, దస్తగిరి, ప్రసన్న తదితరులు ఉన్నారు.