హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అడవినే నమ్ముకుని జీవించే నిషల్మశ హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణలో ఆదివాసీ అభివృద్ధి కార్యాచరణను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురసరించుకుని ఆదివాసీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా విజయవంతంగా అమలవుతున్న పలు పథకాలు ఆదివాసీల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయని వివరించారు.
ఆదివాసీ గిరిజనుల ‘జమీన్’ హకు ను కాపాడుతూ అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతులకు పోడుపట్టాలు అందించామని గుర్తుచేశారు. ‘మావ నాటే మావ రాజ్’ అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేశామని, 2,471 గూడేలు, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని వివరించారు. ఆదివాసీల సాధికారత చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలు ఇస్తున్నదని చెప్పారు.