హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితను దేవస్థాన కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 26 గురువారం వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనాన్ని తిలకించేందుకు రావాలని కోరింది. ఈ మేరకు దేవస్థాన ఈవో పురంధర్కుమార్, ఆలయ కమిటీ చైర్మ న్ శ్రీనివాస్రెడ్డి, ప్రధాన అర్చకుడు ఆనందశ ర్మ శనివారం ప్రగతిభవన్లో వారికి ఆహ్వానపత్రిక అందజేశారు. అమ్మవారి శేష వస్ర్తాలు, ప్రసాదం అందించారు. అమ్మవారి దర్శన విషయంలో వారు సానుకూలంగా స్పందించారని దేవాలయ కమిటీ పేర్కొన్నది. అలాగే అరణ్య భవన్లో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులను కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఆన్లైన్ సేవలకు సంబంధించిన వెబ్సైట్ విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు జయన్న, విష్ణువర్ధన్రెడ్డి, హరిబాబు, ఆలయ మాజీ ధర్మకర్తలు వెంకట నరసింహారెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.