హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి 114 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆ తరువాత చేవేళ్లలో 64 మంది, పెద్దపల్లిలో 63, భువనగిరిలో 61 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో 23 మంది, నాగర్ కర్నూల్లో 34 మంది నామినేషన్ వేశారు. శుక్రవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. 29న నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనున్నది. అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను, వారి కేటాయించిన గుర్తులను ప్రకటిస్తారు.