హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనలో చరిత్ర సృష్టించిన రోజు ఫిబ్రవరి 18 అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల క్రితం ఇదే రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన రోజు అని ట్విట్టర్లో గుర్తుచేసుకొన్నారు. కేసీఆర్ లాంటి దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజాఉద్యమం విజయం సాధించిన రోజు అని పేర్కొన్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రోజు: ఎమ్మెల్సీ కవిత
‘తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టం. కేసీఆర్ చరిత్ర సృష్టించిన రోజు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తికి మెప్పు పొంది, ప్రత్యేక తెలంగాణకు లోక్సభలో ఆమోదముద్ర పడిన శుభదినం ఫిబ్రవరి 18’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భమని, పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్ నిరూపించిన రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలను ఆమె శనివారం ట్విట్టర్లో షేర్చేశారు.