హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత నియంత్రృత్వ పాలన సాగిస్తున్నారని సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ పార్టీ విమర్శించింది. సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ నాయకత్వంపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్ర కేసును వెంటనే ఎత్తివేయాలని ఒక ప్రకటనలో ఆ పార్టీ డిమాండ్ చేసింది.
అన్నలు రావాలి.. నక్సలైట్ల అవసరం మళ్లీ వచ్చింది.. అని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లి సభలో రేవంత్రెడ్డి ప్రకటించారని, కానీ అందుకు విరుద్ధంగా పూసపల్లి కుట్ర కేసు నమోదు చేశారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.