నాగర్కర్నూల్, మార్చి 17 : అయోధ్య క్షేత్రాన్ని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీరామనామ లిఖిత స్తూపంలో పెట్టే 28 కోట్ల శ్రీరామనామ లిఖిత పుస్తకాలకు ఎమ్మెల్యే మర్రితోపాటు ఆయన సతీమణి జమున, కుటుంబసభ్యులు పూజలు చేశారు. అనంతరం శ్రీరామనామ స్తూపంలో రామచంద్రుని, సీతమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన, సాయంత్రం కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.