హైదరాబాద్ , సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా రావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని మలేషియా ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. దేశంలోని రైతులు, మహిళలు, పేదలు అందరూ సంతోషంగా ఉండటం కేసీఆర్తోనే సాధ్యమని చెప్తున్నారు. కేసీఆర్ విజన్, డైనమిజం దేశానికి అవసరమని అంటున్నారు.
దేశంలోని ప్రతిరైతుకు దక్కాల్సిన గొప్ప పథకం రైతుబంధు. ప్రతి రైతు కుటుంబానికి నేనున్నాంటూ భరోసానిచ్చే అద్భుతమైన పథకం రైతుబీమా. ఒకప్పుడు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసేవారు. దీనివల్ల పంటంతా వ్యాపారులకు ఇచ్చేయాల్సి వచ్చేది. రైతుకు చివరికి కూలి కూడా గిట్టేది కాదు. కానీ రైతుబంధు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అకౌంట్లో పడుతున్న రూ.10,000 సొమ్ముతో రైతు సాగు చేస్తున్నాడు. పంటను కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకొంటున్నాడు. ఫలితంగా రైతు ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. కుంటిసాకులతో సరిపెట్టకుండా రూ.5 లక్షలు అందజేస్తున్నది. కుటుంబ పెద్ద లేకపోయినా నేనున్నానంటూ కేసీఆర్ ఆ ఇంటికి పెద్దదిక్కై అండగా ఉంటున్నారు. అంటువంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వస్తే.. దేశ భవిష్యత్తే మారిపోతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రంతో దేశంలో రైతురాజ్యం వస్తుంది.
– శ్యామ్ రాజారామ్,సాఫ్ట్వేర్ ఇంజినీర్, తిరుచ్చి, మలేషియా
కేసీఆర్ విజన్ దేశానికి అవసరం
ఒకప్పుడు తెలంగాణ బీడు భూములతో అల్లాడిపోయేది. కానీ నేడు పచ్చటి పొలాలతో కళకళలాడుతున్నది. ఒకప్పుడు నీళ్ల కోసం బిందెలతో కుళాయిల వద్ద పంచాయితీలు జరిగేవి. కానీ నేడు ప్రతిఇంట్లో ఆడపడుచుకు నల్లా నీళ్లు అందుబాటులోకి వ చ్చాయి. కేసీఆర్ తన విజన్తో మిషన్ భగీరథ, కాకతీయ వంటి గొప్ప పథకాలతో అభివృద్ధికి సరికొత్త భాష్యం చెప్పా రు. ఒక్క నీటిబొట్టును కూడా వృథా చేయకుండా కాపాడుకోవడం ఎలాగో దేశానికి చూ పించిన గొప్ప దార్శనికుడు కేసీఆర్. దేశమంతా అలా సస్యశ్యామలం కావాలం టే, దేశంలోని ప్రతిఇంటికీ తాగునీరు రావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దేశంలోని ఆడపడుచులు కేసీఆర్ పాలన కోరుకుంటున్నా రు. ఆయన విజన్ దేశానికి అవసరం.
-విజయ్, కన్నడ అసోసియేషన్,మలేషియా
దేశమంతా కావాలి ఉచిత కరెంట్
దేశంలో అభివృద్ధికి మేమే ఐకాన్ అని చెప్పుకొనే పార్టీ ప్రభుత్వాలు ఎన్నో రాష్ర్టాల్లో ఇవాళ పవర్ హాలిడేలు ఇస్తున్నాయి. గంటలకొద్దీ కరెంట్ కోతలు విధిస్తున్నారు. పరిశ్రమలు మూత పడుతున్నాయి. పొలాలు ఎండిపోతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. కానీ ప్రస్తుతం తెలంగాణలో పవర్ హాలిడేలు లేవు. కరెంట్ కోతలు లేవు. పొలాలు ఎండిపోవడం లేదు. రైతు ఆత్మహత్యలు లేవు. కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. వీటన్నింటికీ కారణం కేసీఆర్ అకుంఠిత దీక్ష. ముందుచూపు. కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇవాళ 24 గంటల నాణ్యమైన విద్యు త్తు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
– షేక్, ఆంధ్రా అసోసియేషన్, మలేషియా
పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనలో కేసీఆర్ ఆదర్శం
తెలంగాణలో పరిశ్రమలు స్థాపించాలంటే టీఎస్ ఐపాస్ ద్వారా ఒక్క రోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల ను ఆకర్షించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో కేసీఆర్ చొరవ ఆద ర్శం. దేశంలో ఐటీ రంగంలో బెంగళూరు ముందువరుసలో ఉండేది. కానీ తెలంగాణ విధానాలతో అది వెనక్కు వెళ్లి హైదరాబాద్ టాప్లోకి వచ్చింది.
– అక్షర,ఢిల్లీ అసోసియేషన్, మలేషియా
దేశమంతా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రావాలి
ఆడపిల్ల పెళ్లి అంటే మామూలు విషయం కా దు. కానీ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లతో పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఆ పథకాలు దేశమంతా రావాలి.
– నితీశ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్,కేరళ, మలేషియా
దేశమంతటా ఆసరా పింఛన్ రావాలి
తెలంగాణలోని దివ్యాంగులు, వితంతువు లు, ఒంటరి మహిళలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. వాళ్ల సమస్యలను దగ్గర నుంచి చూసిన నేత కాబట్టి.. గతంలో రూ.200 ఉన్న పింఛన్ రూ.3 వేలకు పెం చారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ర్టాల్లో నేటికీ రూ.500, రూ.1000 మాత్రమే ఇస్తున్నారు. కొన్నిచోట్ల ఐదారు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగి నా రావడం లేదు. కానీ తెలంగాణలో దరఖా స్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ పింఛన్ ఇస్తున్నా రు. తెలంగాణ తరహాలో ప్రతినెలా పింఛన్ రావాలని దేశంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆశిస్తున్నారు.
– పూర్ణ చందర్ రావు,ఆంధ్రా అసోసియేషన్, మలేషియా