హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని( Kagajnagar) జెడ్పీ హెచ్ ఎస్ పెట్రోల్ పంపు ప్రభుత్వ పాఠశాలకు (Government school,) ఓ కాంట్రాక్టర్(Contractor) తాళం( Locked) వేశాడు. దీంతో విద్యార్థులు విద్యార్థులు బయటే వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. సదరు కాంట్రాక్టర్ నూతన స్కూల్ బిల్డింగ్ నిర్మించి 8 నెలలు అవుతున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటి వరకు రూ.97 లక్షల నిర్మాణ బిల్లులు ఇవ్వడం లేదనే ఆవేదనతో పాఠశాలకు తాళం వేశాడు. సమస్యను త్వరగా పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.