Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం 75 రోజుల వ్యవధిలోనే ముగ్గురు పోలీసు కమిషనర్లను బదిలీ చేసింది. ఇత ర పోలీసు అధికారులను కూడా మార్చుతూ గందరగోళం సృష్టిస్తున్నది. తమను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన బదిలీ చేస్తున్నదో తెలియడం లేదని సదరు అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో డీఎస్ చౌహాన్ను రాచకొండ పోలీసు కమిషనర్గా నియమించారు. కొద్ది రోజుల్లోనే ఆయనకు సివిల్ సైప్లె కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. రాచకొండ కమిషనర్గా సుధీర్బాబును నియమించారు.
సోమవారం మళ్లీ సుధీర్బాబు ను తప్పించి డాక్టర్ తరుణ్జోషికి సీపీగా బాధ్యతలు అప్పగించారు. ఎల్ఎస్ చౌహాన్ను జనవరి 3న రామగుండం పోలీస్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. సోమవారం ఆయనను జోగులాంబ జోన్-7 డీఐజీగా బదిలీ చేసింది. రామగుండం కమిషనర్గా ఎం శ్రీనివాసులును నియమించింది. జనవరి 3న జోయల్ డేవిస్కు జోగులాంబ జోన్-7 డీఐజీగా పోస్టింగ్ ఇచ్చి.. తరువాత వెయిటింగ్లో పెట్టారు. తాజాగా ఉత్తర్వుల్లో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా నియమించారు. రెండున్నర నెలల్లోనే బదిలీలు చేపట్టడంతో అధికారుల్లో గందరగోళం నెలకొన్నది.