వీఆర్ఏల ఏండ్లనాటి కల.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్ స్వప్నాన్ని సీఎం కేసీఆర్ నెరవేర్చుతూ.. మంగళవారం ఉత్తర్వులు జారీచేయడంపై సంబురపడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలో 560, పెద్దపల్లి 491, జగిత్యాల 811, సిరిసిల్ల 468 కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో 2,330 మందికి లబ్ధి కలుగనుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.