వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం రాత్రి బల్లి పడిన భోజనం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంపై విచారణ జరిపారు.
అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా వార్డెన్, కుక్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కాగా, అంతకుముందు సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్రిజన బాలికల హాస్టల్ను సందర్శించి ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపారు.