హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగా ణ): విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. క్రీమిలేయర్ కారణంగా ఓబీసీ కోటా రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీమిలేయర్ను వెంటనే రద్దు చేయాలని కోరు తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం ఆయ న లేఖ రాశారు. ప్రస్తుతం 27 శాతం ఓబీసీ కోటాలో 16 శాతం మాత్రమే భర్తీ చేస్తున్నార ని, ఇది ఓబీసీల పట్ల వివక్షేనని ఆగ్రహం వ్య క్తం చేశారు.
ఆర్టికల్ 15(4), 16(4) కింద ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, రా జ్యాంగబద్ధంగా నియమించిన మండల్ కమిషన్ రిపోర్టు, కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టు, 180 బీసీ కమిషన్లు ఎక్కడా కూడా క్రీమిలేయర్ ప్రస్తావన తీసుకురాలేదని చెప్పారు. రిజర్వేషన్ వ్యవస్థ సరిగ్గా అమలైతే ఓబీసీలకు విద్యా, ఉపాధి, పదవుల్లో అవకాశాలు లభిస్తాయని, వాటి ద్వారా ఆయా కులాల్లో సాధికారత, సామాజిక హోదా పెరుగుతుందని చెప్పా రు. దేశవ్యాప్తంగా 54శాతం బీసీ జనాభా ఉంటే.. కేంద్ర ప్రభుత్వంలో బీసీ ఉద్యోగులు కేవలం 16 శాతం మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఓబీసీ కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు పెద్ద అడ్డంకిగా ఉన్న క్రీమిలేయర్ వ్యవస్థను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.