హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్రావుకు సరైన గదిని కేటాయించాలని స్పీకర్ ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ఎల్పీ విజ్ఞప్తిచేసింది. శనివారం బీఎర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, సీహెచ్ మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు.
కొన్నేండ్లుగా ప్రతిపక్ష నేతకు కేటాయిస్తున్న గదిని కేటాయించకుండా చిన్న గదిని కేటాయించారని పేర్కొన్నారు. 39 మంది సభ్యులున్న బీఆర్ఎస్కు ప్రస్తుతం కేటాయించిన చిన్న గది ఏ మాత్రం సరిపోదని, దాని కంటే రెండింతల గదిని ప్రధాన ప్రతిపక్ష నేతకు, మరో గదిని బీఆర్ఎస్ఎల్పీకి స్పీకర్ చాంబర్ సమీపంలో కేటాయించాలని కోరారు.