వరంగల్ : ఆత్మహత్యకు పాల్పడిన చైత్ర హత్య కేసు నిందితుడు రాజు మృత దేహాన్ని వారి కుటుంబ సభ్యులు గుర్తించారని వరంగల్ ఏసీపీ గిరి కుమార్ తెలిపారు. రాజు మృదేహం పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకొచ్చారు. కాగా, రాజు చేతిమీది టాటూ ఆధారంగా డెడ్ బాడీ రాజుదే అని వారి బంధువులు ఐడెంటీపై చేశారని ఏసీపీ తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం రెల్వే పోలీస్ ఆధ్వర్యంలో బంధువులకు అప్పగించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయని వివరించారు. రాజు తరఫున బంధువులే వచ్చారు. రాజు భార్య తరుఫున ఎవరూ రాలేదని ఏసీపీ తెలిపారు.