హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్-2024 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆలస్య రుసుముతో కూడిన ఫీజు చెల్లించేందుకు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. డిసెంబర్ 30తో ముగియనున్న ఈ గడువును జనవరి 3వ తేదీకి పెంచినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
జనవరి 3లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీ య సంవత్సరాలకు 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇప్పటివర కు మొత్తం 9,77,040 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినట్టు బోర్డు వెల్లడించింది.