హైదరాబాద్, ఆగస్టు11 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 21న నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీకి లేఖలు రాసింది.
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై ఇదే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. తాగు, సాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 16 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ బోర్డును ఏపీ ప్రభుత్వం ఇటీవలే కోరింది.