హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించలేమని బోర్డు స్పష్టం చేసింది. నాగార్జునసాగర్ నుంచి విశాఖ 550 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని గుర్తు చేశారు.
బోర్డును విశాఖకు తరలిస్తే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడతాయని, విజయవాడకు తరలించే ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్రానికి నివేదించారు.