నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన దళిత బంధు( Dalith Bandhu)ను గ్రౌండింగ్ (Grounding) చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో నల్లగొండ(Nallagonda) కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగారు. గ్రౌండింగ్ ప్రక్రియను చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సాధన సమితి సభ్యులు తెలిపారు. ధర్నాకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయనట వెంట స్థానిక బీఆర్స్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.