నల్లగొండ : దళిత బంధు(Dalitha bandhu) ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో శుక్రవారం శాలి గౌరారం మండలానికి చెందిన దళిత బంధుకు లబ్ధిదారులు నల్లగొండ (Nallagonda) జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడగు నాగార్జున మాట్లాడుతూ.. బేష జాలాలకు పోకుండా పార్టీల మధ్యన ఉన్న వైశమ్యాలను పక్కకు పెట్టి దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని, విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని వారన్నారు. నల్లగొండ నియోజకవర్గం లోని 1050 మందినకి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినందున యధావిధిగా సాగాల్సిన గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పారు. నూతన ప్రభుత్వం దళిత బంధు నిధులను రీలిజ్ చేయలేదన్నారు.
ఈ కార్యక్రమంలో మామిడి రమేష్, ఏర్పుల నరెందర్, పోతెపాక నవీన్, బడుపుల శంకర్ మామిడి యాకూబ్ అద్దంకి రవీందర్, రాచకొండ గణేష్, మాచర్ల వెంకట్, ఈర్ల కిరణ్, డేగల ఏలీషా, మాగి రవి, పులిగిల్ల శంకర్, పనికర కమలాకర్, గుండ్లపల్లి రవి, బందేల ఉదయ, తోటకూరి వంశీ, నక్క నరేష్, రావీ దావీదు, ఆంజనేయులు, దేవరకొండ శ్రీనివాస్, మాచర్ల అంజయ్య, సైదులు, సురేష్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.