హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పలు రైల్వేస్టేషన్ల పరిధిలో 12 ప్రత్యేక రైళ్లను పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు.
అహ్మదాబాద్-తిరుచిరాపల్లి, విశాఖపట్నం-కర్నూల్, భువనేశ్వర్-తిరుపతి, షోలాపూర్-ఎల్టీటీ ముంబయి, షోలాపూర్-తిరుపతి, పూణే-అమరావతి వంటి స్టేషన్ల పరిధిలో ఈనెల 28 నుంచి జనవరి 29 వరకు రైళ్ల రాకపోకలు ఉంటాయి.