నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 27: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురంగా కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఒకే మీదకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో నిర్వహించిన సమ్మేళనంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మ న్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలంతా అన్నదమ్ములతో సమానమని, వారి సంక్షేమమే ధ్యేయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్లోని పార్టీ కార్యాలయంలో 18 వార్డుల పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భర్త చనిపోయి పోషణ కష్టంగా మారిన మహిళా కార్యకర్త నిర్మల, క్యాన్సర్తో బాధపడుతున్న మరో కార్యకర్త శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉం టానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులతో కలిసి మంత్రి భో జనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడి తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బడా చోర్ అని స్పీ కర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ పోచారం మాట్లాడారు. డీసీసీబీ చైర్మన్ పోచా రం భాస్కర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి వందలాదిమంది బీఆర్ఎస్లో చేరా రు. కాంగ్రెస్ నాయకులు మీరాసేట్, ఖమ్రుద్దీన్, మాజీ వార్డు సభ్యుడు నర్సింహాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్, బీజేపీ మండల అధ్యక్షుడి సోదరుడు గుడుగుట్ల అనిల్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది బీఆర్ఎస్లో చేరారు.