AP News : డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్షా శిబిరానికి చేరుకోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరమ్మతో పాటు అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, వైకాపా శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ప్రస్తుతం అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.