హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలానికి అద్భుత ఆదరణ లభిస్తున్నది. శుక్రవారం మూడు రోజు నిర్వహించిన వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పలువురు పోటీపడ్డారు. ఉదయం 30, మధ్యాహ్నం నుంచి మరో 30 ప్లాట్లను వేలం వేయడంతో హెచ్ఎండీఏకి మొత్తం రూ.131.97 కోట్ల ఆదాయం వచ్చింది.
చరరపు గజం గరిష్ఠంగా రూ.76 వేలు, కనిష్ఠంగా రూ.55 వేలు పలకడంతో సగటు ధర రూ.64,159గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ వేలంలో బుధవారం నుంచి ఇప్పటివరకు 178 ప్లాట్లను విక్రయించడంతో మొత్తం రూ.387.11 కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు. రోజుకు 60 చొప్పున ఈ నెల 28, 29న మరో 120 ప్లాట్లను వేలం వేయనున్నట్టు తెలిపారు. 165 ఎకరాల విస్తీర్ణంలో 1,321 ప్లాట్లతో అభివృద్ధి చేసిన ఈ రెసిడెన్షియల్ లేఅవుట్ ఐటీ కారిడార్కు సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.