హైదరాబాద్, నవంబర్9 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం 1956 సెక్షన్-3 కింద కేంద్ర జల్శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ శుక్రవారం లేఖ రాశారు.
తెలంగాణ ప్రాజెక్టుల మూలంగా ఏపీకి గోదావరి జలాలు వచ్చే అవకాశం లేకుండా పోతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. గోదావరిలో నీటిలభ్యత ఎంత ఉన్నదో తేల్చాలని, ప్రాజెక్టుల వారీగా జలాలను పంపిణీ చేయాలని, అందుకు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది.