హైదరాబాద్, ఫిబ్రవరి 24 (హైదరాబాద్): చండీగఢ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ చౌరస్తాలో గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య మాట్లాడుతూ.. లాభాల్లో ఉండి అతితక్కువ విద్యుత్తు చార్జీలతో నడుస్తున్న చండీగఢ్ విద్యుత్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటుపరం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ప్రధాని మోదీ ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం నేతలు నాసర్ షరీఫ్, స్వామి, పరమేశ్, అనిల్, కొరటాల వెంకటేశ్వర్లు, వీరస్వామి, ఆంజనేయులు పాల్గొన్నారు.