హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): భారత్- అమెరికా మధ్య అంతరిక్ష సంబంధాలపై ‘విజువల్ ఆర్ట్ కాంపిటీషన్’ నిర్వహిస్తున్నట్టు అమెరికా కాన్సులేట్ తెలిపింది.
సృజనాత్మక చిత్రాలను ఈ నెల 27లోగా తమకు పంపాలని కోరింది. విజేతలను అమెరికా స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తామని పేర్కొన్నది.