హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి కాపాడేందుకు, నేతన్నలను ఆదుకొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు.
గత రెండు మాసాలుగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ స్తంభించిపోయిందని పేర్కొ న్నారు. నేతన్నల సమస్యలపై సీఎం స్పందించి గత బతుకమ్మ చీర లు, ఇతర బకాయిలు రూ.290 కోట్ల విడుదల చేయాలని కోరారు.