సంగారెడ్డి : ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అది విప్లవాత్మక చర్యగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు పై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేస్తామన్నారు. మన బడి, మన ఊరు పథకాన్ని బీజేపీ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు.
సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దళితబంధు నిధులు ఇప్పటికే సంగారెడ్డి కలెక్టర్ ఖాతాలో జమ చేశామని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి అవుతుందన్నారు. మార్చి మొదటి వారంలో యూనిట్ల గ్రౌండిగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హుజురాబాద్ ఎన్నికల తర్వాత దళితబంధు ఉండదు అన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. దళితబంధుకు వచ్చే బడ్జెట్ లో నిధుల కేటాయిస్తామన్నారు.
బీజేపీ ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని కాపీ చేసి ‘హర్ గర్ జల్’ పేరుతో దేశంలో ప్రవేశపెట్టారన్నారు. అలాగే దళితబంధు లాంటి పథకాన్ని కూడా దేశ వ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 53 రెసిడెన్షియల్ ఎస్సీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని విమర్శించారు.
మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని బీజేపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. బీజేపీ నాయకులు అనవసర విమర్శలు చేయద్దన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో టీచర్లు ఉన్నారని, అందుకే కేంద్ర గణాంకాలే నిదర్శనమన్నారు.
త్వరలో 20 కవేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. బండి సంజయ్కు సవాల్ చేస్తున్న. రాష్ట్రానికి రావాల్సిన 21 నవోదయ పాఠశాలు తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్ రావు, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.