TSPSC | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. న్యూఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అకడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా చేసేలా విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. టీఎస్పీఎస్సీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే సమకూర్చాలని అధికారులకు సూచించారు.
త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ, పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేరొన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఎకడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎకడ అవసరమో పరిశీలించి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించాలని ఇంటర్బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. పరీక్షల కోసం మూడు రకాల షెడ్యూల్స్ తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 28, మార్చి 1, లేదా మార్చి 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించాలని అధికారులు ప్రతిపాదించారు.
హైదరాబాద్లో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు నది పరీవాహక ప్రాంతం మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మొత్తం మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకుగాను, మూసీ నది వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్మెంట్ పారులు, హాకర్ జోన్లు, పాత్ వేలను పీపీపీ విధానంలో నిర్మించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు తగు స్థాయిలో నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యుత్తు టారిఫ్ రెగ్యులేషన్ 2023 ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ గడువును టీఎస్ఆర్సీ పొడగించింది. ఈ గడువు ఈ నెల 7వ తేదీతో ముగియగా, తాజాగా 14 వరకు పొడగించింది. ఇక ఈ నెల 18న బహిరంగ విచారణ జరపనున్నట్టు ఈఆర్సీ వర్గాలు వెల్లడించాయి.