హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం నేటితో నిజమైందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ భారీగా ఉద్యోగాల నియామకం ప్రకటన చేయడం పట్ల దశాబ్దంన్నరపాటు అనేక ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సరైన మార్గంలో వెళ్తుందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసినటువంటి ఉద్యమ నాయకుడిగా ఈ రోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ 91 వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన చేయడం వాటిని తక్షణమే భర్తీ చేస్తానడం తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో.. ఈ రోజు కూడా అంతే సంతోషంగా ఉందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించుకుని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చేశారు. తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న కార్యదక్షత,చిత్తశుద్ధి ఇవాళ మరో సారి రుజువైందన్నారు.