నాగార్జునసాగర్ : అందరికి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం రావడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు.బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం ఆయన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ కేంద్ర సర్వీసుల మార్పునకు సవరణలను తెస్తుందని ఆయన ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ , ఎస్టీ కమిషన్లను కూడా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అడ్డగోలు దీక్షలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు.
ఉమ్మడి ఏపీలో కూడా ముద్రగడ పద్మనాభంను కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలన్నారు. బండి సంజయ్ ను పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించకపోతే ప్రివిలేజ్ కమిటీకి వెళ్లవచ్చు అన్నారు. రాజకీయ వివాదాల్లోకి ప్రివిలైజ్ కమిషన్ లను లాగడం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను దూషిస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. జీఓ 317పై ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుందని గుత్తా స్పష్టం చేశారు. జోనల్ విధానం అమలులో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రతి ఉత్తర్వుల మేరకే పనిచేస్తుందన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారం కోసం పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల సవరణ లో ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీడీపీ నిధులు రూ.150 కోట్ల విడుదలయ్యాయని గుత్తా తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి అందరూ కలిసి రావాలి. జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఉన్నారు.