రాజన్న సిరిసిల్ల : జిల్లాలో జనశక్తి నక్సలైట్స్ ఆయుధాలతో సమావేశం పెట్టారు అనే వార్త కొన్ని న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అలాంటి సమావేశాలు జిల్లాలో జరగలేదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో జనశక్తి మూమెంట్ లేదు అని, ప్రజలు ఎవరు కూడా భయపడవద్దన్నారు.
అలాంటి సమాచారం ఉంటే దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో సమాచార ఇవ్వాలని సూచించారు. జనశక్తి పేరు మీద ఎవరన్నా ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే.. సమాచారం ఇవ్వాలని, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.