ఎల్బీనగర్, మార్చి 28: శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ రింగ్రోడ్డు చౌరస్తాకు నామకరణం చేయడం ద్వారా తన కొడుకు త్యాగానికి గుర్తింపు దక్కిందని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. మంగళవారం కర్మన్ఘాట్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తన కొడుకు ఆత్మబలిదానం చేసుకొన్న ఎల్బీనగర్ చౌరస్తాకే పేరు పెట్టి శ్రీకాంతాచారి ఆత్మకు శాంతి చేకూర్చారని చెప్పారు.
మంత్రి కేటీఆర్ పెద్ద కొడుకులా మారి తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సహకారంతో శ్రీకాంతాచారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. అమరవీరుడు శ్రీకాంతాచారిని తెలంగాణ గడ్డ మరువదని అన్నారు. ఫ్లైఓవర్ కిందనే శ్రీకాంతాచారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.