హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టుపకల ప్రాంతాల అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు 84 గ్రామాల ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం సచివాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్యతోపాటు 111 జీవో పరిధిలోని గ్రామాలు, మండలాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేసి, మాట నిలుపుకున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు.