హైదరాబాద్ : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కన్వీనర్ గుజ్జ కృష్ణ సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతూ వారికి ఉద్యోగ భద్రత కల్పించడం సంతోషకరమన్నారు.