TGSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని పేర్కొంది. హైవేలపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుందని.. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్లోని టోల్ సెస్ను సవరించామని పేర్కొంది.
ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందంటూ సోషల్మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.