హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ ఉద్యోగులు అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవోస్) అధ్యక్షురాలు వీ మమత తెలిపారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న టీజీవోస్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆమె పతాకావిష్కరణ చేసి, మాట్లాడారు.
కేసీఆర్ పెద్ద మనసుతో ఎనిమిదేళ్లలో ఉద్యోగుల జీవితాలే మారిపోయాయని చెప్పారు. ఈ వేడుకల్లో టీజీవోస్ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నాయకులు రవీందర్, అనిల్ కుమార్, జీ వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణయాదవ్, బీ వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, సుజాత, సబిత తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ భవన్లో..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సనత్నగర్లోని కార్యాలయంలో సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. క్రీడలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రఘు, పీసీబీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు జీ శ్రీవాత్సవ, జనరల్ సెక్రెటరీ కృపానంద్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు మధుగౌడ్, జనరల్ సెక్రటరీ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.