హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ను విడుదల చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, మహిళా ప్రతినిధి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ను జారీ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చింతలకుంట చెక్పోస్టు సమీపంలోని పల్లవి గార్డెన్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా, మధ్యాహ్నం ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.