హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : హానరింగ్ ఆఫ్ వుమెన్ అడ్మినిస్ట్రేటర్ ఇయర్ -2023 అవార్డును టీజీవో అధ్యక్షురాలు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వీ మమత అందుకొన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఆమెకు అవార్డు అంద జే శారు.
మహిళల పాలనా దక్షత కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవ లు అందించిన ఆమెకు అవార్డు వరించింది. మమత కు అవార్డు రావడం పట్ల టీజీవో ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, రవీందర్ కుమార్, సహదేవ్, జీ వెంకటేశ్వర్లు, కృష్ణాయాదవ్, వెంకటయ్య హర్షం వ్యక్తంచేశారు.