హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో సమావేశమయ్యారు. లండన్ పర్యటనపై ముచ్చటించారు. లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్లోని మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇటీవలి తన లండన్ పర్యటనలో థేమ్స్ నది నిర్వహణ తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపై అధ్యయనం చేసినట్టు చెప్పారు.
అదే మాడల్లో మూసీ పునరుజ్జీవానికి తలపెట్టిన ప్రణాళికలను, ప్రాజెక్టు ఔట్లైన్ తదితర అంశాలను అలెక్స్తో చర్చించారు. మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధి చేపట్టాలనే నిర్ణయం పట్ల బ్రిటిష్ హైకమిషనర్ హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో సిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజానికి తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, డిప్యూటీ హైకమిషనర్ గారోత్వైన్ ఓవెన్ తదితరులు పాల్గొన్నారు.