TG Rains | తెలంగాణలో ఆదివారం నుంచి ఈ నెల 12 వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
]సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలుపడుతాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడే సూచలున్నాయని పేర్కొంది. ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే సూచనలు ఉన్నాయని వివరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.