TG CPGET 2025 | ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 20 : రాష్ట్రవ్యాప్తంగా ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల చివరి దశ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసినట్లు టీజీ సీపీజీఈటీ-2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 25వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 26, 27 తేదీలలో వెబ్ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 27వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక సీట్ల కేటాయింపు జాబితాను 28వ తేదీన విడుదల చేస్తామని, అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో 30వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు తమ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.