హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రశాంతంగా ప్రారంభమయింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతున్నది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 జరుగనుంది. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరుగడం ఇది మూడోసారి.
ఈ అర్హత పరీక్ష కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్లో 212, ములుగులో అతి తకువగా 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షకు హాజరవుతున్నారు.