యాదాద్రి, జనవరి 7: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణ తాపడానికి టెస్కాబ్ పాలక మండలి రూ.1,16,116 విరాళం సమర్పించింది. శుక్రవారం యాద్రాదిలో ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి చెక్కు అందజేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణాలు మహాద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.