ఖమ్మం : పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ(Exam paper leak) విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పై ఉగ్రవాదులకు వర్తింపజేసే ఉపా చట్టం(Terrorists Act) కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం(Khammam) నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana Government) అస్థిరపరిచేందుకే బండి సంజయ్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నడిపారన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి బండి సంజయ్ను అరెస్టు చేయకపోతే మరిన్ని పది పరీక్షా పత్రాలు లీకై విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారేదన్నారు. కేంద్రం అనేక అంశాల్లో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, ఇందులో భాగంగా సింగరేణి గనుల(Singareni mines)ను ఒకవైపు ప్రైవేటీకరణ చేయమని చెబుతూ మరోవైపు ప్రైవేటీకరణ(Privatization)కు అవసరమైన చర్యలు తీసుకోవడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
బొగ్గు గనులను ప్రైవేటీకరించే చర్యలను నిరసిస్తూ ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆందోళన చేయాలని నిర్ణయించిందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల చరిత్రలోనే మొదటిసారిగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ భవన్లో సీపీఎం, సీపీఐ మండలస్థాయి నాయకులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని వివరించారు.
మోదీ హఠావో.. దేశ్కీ బచావో.. బీజేపీ హఠావో, దేశ్కీ బచావో అనే నినాదాన్ని సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చిందన్నారు. రూ.13 లక్షల కోట్లు ఎగ్గొట్టిన ఆదానీ(Adani)పై చర్యలు తీసుకోని కేంద్రం ప్రతిపక్ష పార్టీలకు చెందినవారిని ఇబ్బందులకు గురిచేయడానికి సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నదని దుయ్యబట్టారు. ఈ నెల 8న రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ (ST Versity)ఏర్పాటు, బొగ్గు గనుల ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.