BJP | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగా ణ): దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా వారి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయంటూ విషప్రచారం చేసే విపక్షాలు, ము ఖ్యంగా బీజేపీ నేతలు.. డబుల్ ఇంజిన్ రా ష్ర్టాల్లో భారీగా ఉగ్రవాదులు పట్టుబడటంపై నోరు మెదపడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఇటీవల హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజె న్స్, భోపాల్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశా రు.
వారి సమాచారంతో జమాత్ ఉల్ ము జాహిద్దీన్ బంగ్లాదేశ్ సంస్థకు చెందిన 10 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారి స మాచారంతో గుజరాత్లోని పోర్బందర్లో శనివారం ఐసిస్తో సంబంధాలున్న నలుగురు ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులను అరె స్టు చేశారు. వీరంతా ఆయా రాష్ర్టాల్లో దాడులకు వ్యూహాలు పన్నినట్లు గుర్తించారు.