Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ముగిశాయి. టెన్త్ ఎగ్జామ్స్కు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటిచింది.
పది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది ఎగ్జామ్స్ రాశారు. 1,809 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ప్రయివేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు మూడు నమోదు అయ్యాయి. పది పరీక్షలను 2,652 సెంటర్లలో నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించారు.